కేండ్రుక అర్జున్ చాషీమూలియా ఆదివాసి సంఘం కోరాపుట్ జిల్లా కార్యదర్శి.9-8-2010న మావోయిష్టు పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులున్న దళం ప్రపంచ ఆదివాసి దినోత్సవం నాడు అతని గ్రామ సమీపాన పార్వతీపురం – కోరాపుట్ రోడ్డుపై కాల్చిచంపారు. భార్యను వైద్యం కోసం సైకిల్ పై ఎక్కించుకుని వెళుతుండగా ఎస్.ఎల్.ఆర్. రైఫిల్ తో గొంతు వద్ద, 303 తుపాకితో గుండెపై నాలుగు గుండ్లు కాల్చి చంపారు. తన భర్తను చంపవద్దని ఆమె దళంలోని ఒక సభ్యుని కాళ్ళు వాటేసుకుని అర్ధించింది. స్త్రీలు వందలాదిమంది విలపించారు. దాదాపు వెయ్యి మంది అర్జున్ శవాన్ని సంతపోగుపల్లి నుంచి ఏడు కిలోమీటర్ల దూరానగల ఏడుగుమ్మాలవలస వరకు భుజాలపై మోసుకెళ్ళారు.
తమకు నచ్చని రాజకీయ శక్తులను ప్రస్తుత రాజ్యం మట్టుపెడుతున్న తీరులోనే మావోయిష్టు పార్టీకూడా తమకన్నా భిన్నమైన పంధాలో ప్రజా ఉద్యమాలని నిర్మిస్తున్నవారిని భౌతికంగా నిర్మూలించబూనుకోవడం అత్యంత శోచనీయమైన విషయం. సిపిఐ ఎంఎల్ విశ్వం నాయకత్వాన నిర్మింపబడుతున్న ప్రజా ఉద్యమాన్ని విచ్ఛిన్నం చెయ్యడం కోసం, ఆ ప్రాంతం నుండి ఆ పార్టీని తరిమివేయడం కోసం తద్వారా ఆంధ్రా, ఒరిస్సా బోర్డర్ గ్రామాలన్నిటినీ మీ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి చాషీమూలియా ఆదివాసీ సంఘం నాయకులను, సానుభూతిపరులను హత్యచేస్తున్నారనీ, బెదిరిస్తున్నారనీ మేము భావిస్తున్నాము. మాలేఖకు బహిరంగ సమాధానము లభిస్తుందని ఆశిస్తున్నాము.
ఓపిడిఆర్ ఇమెయిల్ opdr_ap@hotmail.com
C.Bhaskararao ,chavali.Sudhakararao, v.Narayana