హైదరాబాదు 7-10-2010. ఐ.ఏ.ఎస్. అధికారిగా వుండి ఎన్నో ముఖ్య పదవులు నిర్వహించి, నైతిక విలువలు కలిగి, నీతిగా, నిజాయితీగా, మానవతావాదిగా, ప్రజాతంత్రవాదిగా తుది శ్వాసవరకూ నిలిచిన యస్.ఆర్. శంకరన్ గారి మరణం దిగ్బ్రాంతి కరం. ఆయన వంటివారు కాగడా పెట్టి వెదకినా లభించడం ఈ రోజు కన్పించడం అనుమానాస్పదం. దళితులకు విద్య, రిజర్వేషన్ల కోసం ఎన్నో ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చారు. పేద ప్రజలకు ఇండ్ల స్తలాలకోసం, భూసంస్కరణ చట్టం అమలు కోసం, అవినీతి నిర్మూలనకోసం కృషి చేశారు. మన అందరిమధ్య సాధారణ జీవితం గడిపారు. ఆయన కృషి ఫలితంగా 2004లో ప్రభుత్వంతో నక్సలైట్లు చర్చలు జరిపారు. ఆయన మృతి తీరని లోటు.
ఇట్లు,
వి.నారాయణ, సి.భాస్కరరావు.
No comments:
Post a Comment