Monday, March 28, 2011

ఈస్టుకోస్టు ధర్మల్ పవర్ ప్రాజక్టు వ్యతిరేక ఉద్యమకారులపై పోలీసు కాల్పులు

ది.28-2-2011ఈస్టుకోస్టు ధర్మల్ పవర్ ప్రాజక్టు వ్యతిరేక ఉద్యమకారులపై పోలీసు కాల్పులు జరిపారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్ధ (ఓపిడిఆర్) నిజ నిర్ధారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ 5,6 తేదీలలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళీ మండలం , వడ్డితాండ్ర, కాకరాపల్లి, తెలుగు పెంట, హెచ్చిఎన్ పేట, నగిరిపేట, అంట్లవరం, వడ్డివాడ, ఆకాశలక్కవరం, సీరవానిపేట తదితర గ్రామాలలో పర్యటించి, వివరాలు సేకరించారు.

చెరువులు, కుంటలు, కాలువలు, నదులు, సముద్రతీరము వంటివన్నీ ప్రజల ఆస్తులు. వీటిని కాపాడే ట్రష్టీ ప్రభుత్వము. వీటిని ప్రయివేటు పరం చేయరాదని సుప్రీం కోర్టు తెలిపింది. ఎలక్ట్రిసిటీ చట్టం 2003 ప్రకారము తంపర భూముల్లో ధర్మల్ పవర్ ప్రాజక్టులు పెట్టరాదని నిషేధించింది. కాని ప్రభుత్వాధికారులు రెండు పంటలు పండే భూములను మెట్టభూములుగా చూపినందున ప్రాజక్టుకు అనుమతి లభించింది. ప్రాజక్టును 1240 ఎకరాల్లో , ప్రభుత్వభూమిలో నిర్మించామని చెబుతూ 3333 ఎకరాలు ఆక్రమించింది. కొన్నానని చెబుతుంది.

200రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రజలను నేరస్తులుగా చూపి, ఆత్మరక్షణకై కాల్పులు జరిపామని, రబ్బరు బులెట్లే వాడామని, మృతులు జీరు నాగేశ్వరరావు, సీరపు ఎర్రయ్య కుటుంబాలనుంచి పోలీసులు బలవంతంగా తెల్లకాగితాలపై వేలిముద్రలు తీసుకున్నారు. మహిళలు ,పిల్లలు ,వృద్ధులనే విచక్షణ లేకుండా కాల్పులు జరిపి, లాఠీచార్జి చేసి, ఇళ్ళు గడ్డికుప్పలు తగులబెట్టినట్లు తెలిసింది.

3000 ఎకరాలలో విస్తరించివున్న తంపలచెరువుపై 540 మత్యకార కుటుంబాలు 1945వ సంవత్సరం నుండి ఏడాదికి రు.30000 చొప్పున లీజు చెల్లిస్తూ చెరువులో దొరికే తుంగను అమ్మి జీవిస్తున్నారు. 20000 ఎకరాల పొలానికి సాగునీరు , ప్రజలకు తాగునీరు వసతి లభిస్తుంది. ఏవక్కరికీ నష్టపరిహారం ఇవ్వలేదు.

కనుక మృతుల కుటుంబాలకు 20లక్షల, గాయపడినవారికి 10లక్షలరూపాయలు

పరిహారం ఇవ్వాలని , 315 మందిపై పెట్టిన క్రిమినల్ కేసులు రద్దుచెయ్యాలని, కాల్పులు జరిపిన పోలీసులపై కేసు నమోదు చేయాలని , ఈస్టుకోస్టు ధర్మల్ పవర్ ప్రాజక్టుకు ఇచ్చిన అనుమతిని రద్దుచెయ్యాలని, తప్పుడు రిపోర్టు ఇచ్చిన రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదుచేసి ప్రాసిక్యూట్ చెయ్యాలని, ఈస్టుకోస్టు ధర్మల్ పవర్ ప్రాజక్టులోని షేరు హోల్టర్ల వివరాలు బహిరంగ పరచాలని, వడ్డితాండ్రలో ఇళ్ళు కాలిపోయిన కుటుంబాలకు వెంటనే ప్రభుత్వము ఇళ్ళు కట్టించి ఇవ్వాలని, సామానులు ,బట్టలు, ఆహారధాన్యాలు కోల్పోయిన వారికి తగిన నష్టపరిహారం ఇవ్వాలని ఓపిడిఆర్ డిమాండ్ చేస్తుంది.

No comments:

Post a Comment