పియుసియల్ అనే పౌరహక్కుల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మరియు ఛత్తీస్ ఘడ్ రాష్ట్రశాఖ అధ్యక్షుడు అయిన వినాయక్ సేన్ కు రాయపూర్ సెషన్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. మావోయిష్టు పార్టీకి తోడ్పడుతున్నాడనే ఆరోపణతో ఆశిక్ష విధించింది.
బినాయక్ సేన్ ఛత్తీస్ ఘడ్ లోని పేద గిరిజనుల మధ్య నివసిస్తూ వారికి వైద్యం అందించుచున్న పిల్లల డాక్టరు. గిరిజనులపై రాజ్యం అమలుచేస్తున్నహింసాకాండను బయటిలోకానికి వెల్లడి చేస్తున్న కృషీవలుడు. ఈపని చేయడం రాజ్యానికి కంట్లో దూలంగా మారింది. ఆయనపై వేధింపులు ప్రారంభమైనాయి. బినాయక్ సేన్ పై ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వము ఆయన నిషిద్ధ సాహిత్యం దొరికిందనే సాక్ష్యంతో రాజద్రోహనేరం మోపి 4సంవత్సరాలు జైలులో నిర్బంధించింది. రాయపూర్ సెషన్స్ కోర్టు బినాయక్ సేన్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా వివిధ దేశాలలోని అనేకమంది మేధావులు, నోబుల్ బహుమతి గ్రహీతలు పెద్ద ఉద్యమాన్ని నిర్వహించారు. భారత సుప్రీం కోర్టు 15-4-2011న బినాయక్ సేన్ బెయిల్ పై విడుదలచేస్తూ సరైన ఆధారాలు లేవని ప్రకటించింది. ఓపిడిఆర్ ఈ పరిణామం పట్ల హర్షం వ్యక్తం చేస్తుంది.
బానిస చట్టాలతో పాలించిన బ్రిటిష్ పాలకులచే రూపొందించబడి , బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అనేకమంది దేశభక్తులపైన, నిజాం కు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిష్టలపైన, నక్సల్ బరీ వంటి ఉద్యమకారులపైన – అదే ఇండియన్ పీనల్ కోడ్ – చట్టం ప్రకారం నేటికీ శిక్షలు విధింపబడడం మన పాలనలోని డొల్లతనాన్ని తెలియజేస్తున్నాయి.
No comments:
Post a Comment