Friday, July 9, 2010

ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ జిహాదీలతో కుమ్మక్కయింది

ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ జిహాదీలతో కుమ్మక్కయింది - గీత సహగల్ ఆరోపణ

గీత సహగల్ ప్రముఖ నవలా రచయిత, సయంత్రాసహగల్ కుమార్తె. ఆమె ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ లండన్ కేంద్ర ఆఫీసులో లింగత్వ విభాగ సీనియర్ అధికారి. మానవ హక్కుల సంరక్షణ పేరుతో ఆమ్నెస్టి జిహాదీలతో కుమ్మక్కయిందని ఆమె అంటున్నట్లు ది సండే టైమ్స్ పత్రిక వ్రాసింది. వెంటనే ఆమ్నెస్టి ఆమెను సంస్థ నుండి సస్పెండ్ చేసింది.

దీని గురించి భారతదేవ పత్రిక ది హిందు లండన్ విలేఖరి ఫిబ్రవరి 9న ఇలా వ్రాసారు. సహగల్ చాలా కాలంగా హక్కుల ఉద్యమంలో పని చేస్తున్న కార్యకర్త. ఆమె ది హిందుతో ఈ క్రింది విషయాలు చెప్పారు. " ఈ విషయాన్ని ముందు సంస్ధలోపట చర్చకు పెట్టాను, ఆమ్నెస్టి దాన్ని పట్టించుకోలేదు. అందువల్ల బహిరంగంగా ప్రకటించక తప్పలేదు. ఈ విషయం పత్రికల్లో ప్రచురితమైన కొన్ని గంటల్లోనే నన్ను సంస్ధ నుండి సస్పెండ్ చేశారు ". ఆ వార్తా కథనం ఇంకా ఈ క్రింది పేర్కొన్న అంశాలతో కూడివుంది.

1) ఈ ఆరోపణపై అంతర్గత విచారణకు ఆమ్నెస్టి చర్యలు తీసుకొంది. ఆ నివేదిక కోసం ఆగకుండానే సంస్థ అంతర్జాతీయ చట్టాలు మరియు విధాన విభాగ సీనియర్ డైరెక్టరు వైడ్నెబ్రౌన్ ఆ ఆరోపణలను తిరస్కరించారు. జిహాదీలు చేస్తున్న హక్కుల ఉల్లంఘనలను మేము నిర్ద్వందంగా వ్యతిరేకించిన రికార్డు మాకుంది అని వైడ్నెబ్రౌన్ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.

2) " పంజరంలో ఖైదీలు " అనే ప్రచార సమూహాలతో ఆమ్నెస్టి సంస్థ కలసి పనిచేయడం వివాదానికి కేంద్రబిందువయింది. ఈ ప్రచారోద్యమ వేదికను గ్వాంటనమబే మాజి ఖైది మొఅజ్జంబెగ్గు ఏర్పాటు చేశారు. తాను తాలిబాన్ అభిమానినని బెగ్గు స్వయంగా అంగీకరించారు. గ్వాంటనమబే జైలును రద్దు చేయాలనీ, అందులో నిర్బంధించినవారికి పునరావాసం కల్పించాలనీ పెద్దఎత్తున ఈ సమూహం చేసిన ప్రచారానికి ఆమ్నెస్టి మద్దతు ఇచ్చింది. బెగ్గు అతని సహచరులు బ్రిటను ప్రధాని గోర్డన్ బ్రౌనును కలసి వినత పత్రం యిచ్చేందుకు వెళ్ళినప్పుడు ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ ఇంగ్లాండు అధినేత కటెఅల్లెను కూడ వారితోబాటు వెళ్ళారు.

3) గ్యాంటనమబేలో తనను నిర్బంధించిన మూడు సంవత్సరాల కాలంలో అమెరికా అధికారులు తనను హింసించినట్లు మొ అజ్జంబెగ్గు చెబుతుంటాడు. తాలిబాన్లకు మద్దతు ప్రకటించడాన్ని కూడ ఆయన సమర్ధించుకుంటాడు. కాని అల్-ఖైదాతోగాని మరేయితర టెర్రరిష్టు గ్రూపులతోగాని తనకు సంబంధాలు లేవంటాడు. పంజర ఖైదీలు ( Cage Prisoners ) వేదిక ఉద్దేశ్యం గ్యాంటనమబే ఖైదీల దుస్థితిని లోకానికి వెల్లడిచెయ్యటమేనని అతను నొక్కివక్కాణిస్తున్నాడు.

4) ఈ సమస్యపై సహగల్ వైఖరికి ఇంగ్లాండులో విస్తారమైన మద్దతు లభించింది. చట్టవిరుద్ధ నిర్బంధాన్నిగ్వాంటనమబే ఖైదీలపై చిత్రహింసలను తాను పూర్తిగా వ్యతిరేకించానని సహగలే అన్నారు. " మొ అజ్జంబెగ్గు లాంటి వ్యక్తులతో జైలు అధికారులు వ్యవహరించిన తీరుకు నేనెంతో తల్లడిల్లాను " అని ఆమె అన్నారు. కానీ ఇంగ్లాండులో " తాలిబాను మద్దతుదారులలో బెగ్గు అత్యంత ప్రముఖుడు " అలాంటి వ్యక్తితో ఆమ్నెస్టి వేదికను పంచుకోవటమనేది అనుచితమైన నిర్ణయం అని ఆమె అంటున్నారు.

5) ఒక ప్రకటనలో సహగల్ ఇలా అంటున్నారు : " సమస్య మొ అజ్జంబగ్గు భావప్రకటన స్వేచ్చ విషయం కాదు. అతను తన యొక్క అభిప్రాయాలను ప్రకటించుకునే అంశం కూడా సమస్యకాదు. అతను ఈ హక్కులను పూర్తిగా వినియోగించుకున్నాడు. మరి సమస్య ఏమిటి? మానవహక్కుల సార్వజనీనతకు భంగం కలిగించే గ్రూపులు మరియు ఆలోచనలతో సహేతుకంగా మానవహక్కుల ఉద్యమం విడగొట్టుకోవాలా లేదా అన్నదే సమస్య, మౌలిక ప్రాధాన్యత గల మానవ హక్కుల పట్ల నాకున్న నమ్మకం వల్ల ఈ సమస్యను నేను లేవనెత్తాను ".

ఈ వార్తా కథనంపై జనపథం చర్చను ఆహ్వానిస్తున్నది.

No comments:

Post a Comment