శ్రీకాకుళగిరిజన ఉద్యమాల అణచివేతను సమగ్రంగా పరిశీలించడం కోసం దేశంలోనే ప్రధమంగా FFC వెయ్యడమే కాక ఆ బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడినవారిని శిక్షించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా వందలాది సభలు పెట్టిన సంస్థ ఓ.పి.డి.ఆర్. .
భార్గవ కమీషన్ విచారణాంశాలు లోపభూయిష్టంగా ఉన్నాయిగనుక దానిని ఓ.పి.డి.ఆర్. బహిష్కరించినది.
సిరిసిల్లా, కొండ మొదలు, అడవి మొద్దులపల్లి తదితర ఉద్యమాలపైన 1980-81 లో రవూఫ్ గ్రూపు కార్యకర్తలను పదిమందిని నల్గొండ జిల్లా పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లో చంపిన ఘటనపై OPDR నిజనిర్ధారణ కమిటీవేసి వివరించింది. జనతాపార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక సంబంధాల బిల్లుకు వ్యతిరేకంగా చారిత్రాత్మక ఉద్యమాన్ని నిర్మించాం. లాకప్ హత్యలకు, స్త్రీలపై అత్యాచారాలకు, నిరంకుశ చట్టాలకూ, ఉరిశక్షలకూ, వెట్టిచాకిరీకి, హరిజనులపై దాడులకు, పట్టణాల్లో పేదల పాకలు కూలగొట్టడానికీ వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు వివరించడం జరిగింది. చేనేత కార్మికుల ఆకలి చావుల గురించి, దివిసీమ ఉప్పెన బాధితుల సంక్షమంకొరకు చేసిన మేము చేసిన కృషిని గురించి ప్రజలందరికీ తెలుసు. ఈ విధంగా ఓ.పి.డి.ఆర్. ప్రజాస్వామ్య హక్కుల కొరకు పోరాడుతుంది.
సి.భాస్కరరావు ప్ర.కా., ఓ.పి.డి.ఆర్.
Wednesday, November 25, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment