Saturday, November 13, 2010

అయోధ్యపై అలహాబాద్ హైకోర్టు అక్రమ తీర్పు

సెప్టెంబరు 30న ఇద్దరు న్యాయాధీశులు –సిగ్భత్ ఉల్లాఖాన్, సుధీర్ అగర్వాల్ లు ఒక తీర్పునివ్వగా ప్రధాన న్యాయాధీశుడు ధరమ్ వీర్ శర్మ విడిగా తీర్పు రాశాడు. బాబ్రీ మసీదులో 1949 డిసెంబరు 23న కొంతమంది చట్ట విరుద్ధంగా సీతారాముల విగ్రహాలను పెట్టిన స్తలమే రాముడు పుట్టిన స్తలంగా హిందూ ప్రజానీకం విశ్వాసం గనుక ఆ స్తలాన్ని హిందూత్వ సంస్థలకు కేటాయించాలి. మొత్తం వివాదాస్పద 1500 గజాల స్తలాన్ని మూడు భాగాలుగా విభజించింది. దౌర్జన్యంగా రామలీలా విగ్రహాలుంచబడిన స్ధలంతో సహా ఒక భాగాన్ని హిందువుల సంస్థకూ, ఒక భాగాన్ని ముస్లీములకు, రామచబుత,సీతరచోయి కట్టడాలతోకూడిన మూడవభాగాన్నిహిందూ సాధువుల సంస్థ నిర్మోహి ఆఖారాకు కేటాయించింది. 1992 డిసెంబరు 6 వరకు అక్కడ మసీదు వుండేదని ఇద్దరు జడ్జీలు అంగీకరించారు కానీ ప్రధాన న్యాయాధీశుడు శర్మ గారు మాత్రం ఆ నిర్మాణానికి మసీదు లక్షణాలు లేవు పొమ్మన్నాడు. కానీ ముస్లీములు దానిని 400సంవత్సరాలుగా విశ్వసిస్తున్నారన్నవిషయం ఆయనకు పట్టలేదు. సమాజంలో ఆధిపత్య భావజాలానికి న్యాయస్థానాలు అతీతం కాదు. కీలవన్మేణి (తమిళనాడు), భన్వారీదేవి (రాజస్తాన్) తీర్పులు నగ్నంగా రుజువు చేసినట్లే అయోధ్య తీర్పుకూడ రుజువు చేసింది.

3 comments:

  1. Hindus are believing that is a ram temple from more than 400 years before Muslims.

    ReplyDelete
  2. You do not seem to be caring to even to think about the beliefs of Hindus. If some invader demolished a Temple and constructed a Mosque in its place and people whose Temple was demolished could not do anything about 400 years, whatever the invader had done becomes correct??!!

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete